తూర్పు గంగవరం లో పారిశుధ్య రథం ప్రారంభం & ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
తూర్పు గంగవరం పంచాయతీలో సోమవారం ఎంపీడీఓ పి. అజిత పారిశుధ్య రథాన్ని ప్రారంభించి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎం. వెంకటేశ్వరరెడ్డి, సొసైటీ అధ్యక్షులు వి. చిన్న సుబ్బారావు, డిప్యూటీ ఎంపీడీఓ వి. శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో Census-2027 ఇంటింటి గణనను వేగవంతం చేయాలని ఎంపీడీఓ సూచించారు. మండలంలో మొత్తం 6,089 మంది పెన్షనర్లకు రూ.2.69 కోట్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 4,047 మందికి రూ.1.80 కోట్లు (68%) పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారికి జూన్ 3 వరకు స్వర్ణ గ్రామ కార్యాలయంలో పెన్షన్లు అందజేయనున్నట్లు వెల్లడించారు.