No.1 Short News

Sk.Asma Reporter 9948680044
విమాన ప్రమాద మృతుల ఆత్మశాంతి కోసం ఖురాన్ పఠనం : ఫారూఖ్ షుబ్లీ
మైనారిటీ & న్యాయ శాఖ మంత్రి ఫరూఖ్ సూచనల మేరకు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియా విమానంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఈరోజు ఉదయం 9 గంటలకు దివ్య గ్రంథం ఖురాన్ పూర్తిగా పఠనం చేసి ప్రార్థన చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ ముస్లిం మత పెద్దలు పెద్దలు మైనార్టీ మరియు న్యాయ శాఖ మంత్రి ఫరూక్ , ఖాజీ హబీబుల్లా హుసేని, MHPS ఉలేమా విభాగం సభ్యులు ముప్తీ యూనస్ , మౌలానా అబ్దుల్ సత్తార్, హఫీజ్ అబ్దుల్ రషీద్ హఫీజ్ అబ్దుల్ సమద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఫరూఖ్ షిబ్లీ మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఎయిర్ ఇండియా విమానంలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని అలాగే వారి కుటుంబాలకు అనంత కరుణామయుడు అపార కృపా శీలుడు అయిన అల్లాహ్ సహనాన్ని ప్రసాదించాలని ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ ఇటువంటి దారుణమైన దుర్ఘటనలో పునరావృతం కాకుండా భగవంతుని యొక్క చల్లని దీవెనలు మా దేశం పై ప్రపంచంపై ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరిగింది.
Latest News
13 Jun 2025 11:15 AM
1
45