

No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ బిచ్కుంద: ఇంటర్ లో మెరిసిన సావిత్రిభాయి ఫూలే వారసురాలు గంధం తేజశ్రీ
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజీద్ నగర్ గ్రామానికి చెందిన గంధం సాయిలు, పోషవ్వ గార్ల కుమార్తె అయినటువంటి గంధం తేజశ్రీ అనే విద్యార్థి సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల కొయ్యగుట్ట (తాడ్కోల్) లో చదివి రాష్ట్రస్థాయి మార్కులైనటువంటి 984/1000మార్కులు సాధించినందుకుగాను బహుజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆ విద్యార్థిని సన్మానించి చిరు జ్ఞాపికను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బహుజన ఉద్యోగుల సంఘం బాధ్యులైనటువంటి క్యాకయ్య సార్ గారు, దండు సాయిలు సార్ గారు,మహేష్ సార్,సతీష్ సార్, సుధాకర్ సార్, రాచయ్య సార్, పీరయ్య సార్ పాల్గొన్నారు
Latest News
27 Apr 2025 14:47 PM