తలసీమియా బాధితుల కోసం గుంటూరులో బృహత్ రక్తదాన శిబిరం పోస్టర్ ఆవిష్కరణ
పాత గుంటూరులో క్యాంపెయిన్షిప్ సంస్థ ఆధ్వర్యంలో తలసీమియా బాధితులకు సహాయంగా నిర్వహించనున్న రక్తదాన శిబిరం పోస్టర్ను సోమవారం ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి & తెనాలి–పత్తిపాడు నియోజకవర్గ పరిశీలకులు గులాం రసూల్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో క్యాంపెయిన్షిప్ సభ్యులు వసీం అలీ చౌదరి, మునీర్, ఖాజా, నజీముద్దీన్, జహీర్ పాల్గొన్నారు.
అలాగే వైసీపీ నాయకులు మున్వర్ హాజరై రాబోయే రక్తదాన శిబిరానికి తమ పూర్తి మద్దతు తెలిపారు.