విద్యుత్ పొదుపుతోనే భవిష్యత్తు భద్రం: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
దర్శి పట్టణంలో నిర్వహించిన పవర్ సేవింగ్ అవగాహన ర్యాలీలో టిడిపి దర్శి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొని, అవసరానికి మించి విద్యుత్ వినియోగం భవిష్యత్తును అంధకారంగా మారుస్తుందని హెచ్చరించారు. సహజ వనరులు, ఇంధనం, విద్యుత్ పొదుపుపై ప్రజల్లో అవగాహన అవసరమన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా సాధ్యమైందని తెలిపారు. ప్రజలు విద్యుత్తును పొదుపుగా వాడుతూ సోలార్ విద్యుత్ వైపు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.