టిడిపి సీనియర్ నాయకుడు కాశయ్య మృతి | గొట్టిపాటి లక్ష్మి పరామర్శ
దొనకొండ మండలం రుద్రసముద్రం గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు, తర్లుపాడు సమితి ఉపాధ్యక్షులు, మాజీ సర్పంచ్ దుగ్గంపూడి ఎర్ర కాశయ్యా గారి మృతి పట్ల దర్శి టిడిపి ఇంచార్జి డా. గొట్టిపాటి లక్ష్మీ, టిడిపి యువ నాయకులు డా. కడియాల లలిత్ సాగర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
కాశయ్యా గారి పార్ధివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.