పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వైసీపీ ఆధ్వర్యంలో దర్శిలో ర్యాలీ
దర్శి నియోజకవర్గంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీ చేపట్టారు.
అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ గారు పాల్గొన్నారు. అలాగే పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లె లో రమణాల వారి పాలెం కరిముల్లా లెవెన్స్ వెన్స్ ఘనవిజయం
తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో జరుగుతున్న GCC రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్లో ఆదివారం కడప, రమణాలవారిపాలెం కరిముల్లా లెవెన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన రమణాలవారిపాలెం జట్టు 122 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన కడప జట్టు 70 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 52 పరుగుల తేడాతో రమణాలవారిపాలెం కరిముల్లా లెవెన్స్ ఘన విజయం సాధించింది. జట్టులో 65 పరుగులు చేసిన నరేంద్రకు మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందజేశారు.
ఒంగోలు పరిశుభ్రతపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి – పారిశుధ్య నిర్వహణ మరింత బలోపేతం చేయాలని ఆదేశాలు
ఒంగోలు నగరంలో పారిశుధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు శుభ్రమైన వాతావరణం కల్పించాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని కొత్త మామిడిపాలెం విండ్రో కంపోస్టింగ్ యూనిట్, చెత్త సంపద కేంద్రం, గాంధీ పార్క్, ఊట చెరువు ప్రాంతం, సులభ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా సేంద్రీయ వ్యర్థాలను ఎరువుగా మార్చే విధానాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. చెత్త సంపద కేంద్రాలను పటిష్టంగా నిర్వహించి నగర పరిశుభ్రతను మెరుగుపరచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
గాంధీ పార్క్లో నిర్మాణంలో ఉన్న వాకింగ్ ట్రాక్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, మున్సిపల్ ఖాళీ స్థలాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఊట చెరువు ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, నగర పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో ఒంగోలు మున్సిపల్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ ఐషయ్య, ఎంహెచ్ఓ వైష్ణవి తదితర అధికారులు పాల్గొన్నారు.
ఒంగోలు, తేదీ: 11-05-2026
ఒంగోలు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ P. Rajababu పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ Kalpana Kumari, జిల్లా రెవెన్యూ అధికారి Chinna Obulesuలతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, వాటిని వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.
తమిళనాడు సీఎం Vijay కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆలయాలు, పాఠశాలలు, బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 మద్యం దుకాణాలను రెండు వారాల్లోపు మూసివేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల ఆరోగ్యం, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్న విజయ్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
చీమకుర్తిలో బూచేపల్లి సుబ్బారెడ్డి 7 వ వర్ధంతి భారీగా నివాళులు అర్పించిన వైఎస్ఆర్సిపి నేతలు
చీమకుర్తిలో దర్శి మాజీ శాసన సభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డి గారి 7వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సూర్య గ్రానైట్స్ సిబ్బందికి దుస్తుల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ , దర్శి ఎమ్మెల్యే మరియు ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు.
బూచేపల్లి సుబ్బారెడ్డి ప్రజలకు చేసిన సేవలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని పేర్కొన్నారు.
కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా ఆయన జ్ఞాపకాలను నిలబెట్టుకోవడం గొప్ప విషయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.
నేను ఓడిపోలేదు.. ప్రజల గుండెల్లో గెలిచాను – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ వైరల్ కామెంట్స్
దర్శి టిడిపి కార్యాలయం వద్ద డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ జన్మదిన వేడుకలు కూటమి శ్రేణులు ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి, గజమాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ
దర్శి ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలు జీవితాంతం మర్చిపోలేను. మీ హృదయాల్లో గెలిచాననే ఆనందం ఉంది. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రతి ఇంటికీ చేర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నాను అన్నారు.
అమృత పథకం కొత్త సబ్ స్టేషన్లు రోడ్ల అభివృద్ధి మినీ స్టేడియం అన్నా క్యాంటీన్ వంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
భారీ ఎత్తున టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
దర్శి రాజకీయాల్లో సంచలనం… Dr. గొట్టిపాటి లక్ష్మీ జన్మదిన వేడుకలతో కురిచేడు కదిలింది!
కురిచేడు వీధులన్నీ పసుపు జెండాలతో కళకళలాడగా భారీ బైక్ ర్యాలీలతో యువత శక్తిని చాటగా మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని లక్ష్మీ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
కురిచేడు టౌన్తో పాటు వీరయ్యపాలెం, వెంగాయపాలెం గ్రామాల్లో కూడా వేడుకలు కోలాహలంగా జరిగాయి. ప్రజల కోసం పనిచేసే నాయకురాలు Dr. గొట్టిపాటి లక్ష్మీ అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.
పాల్గొన్న దర్శి నియోజకవర్గం, కురిచేడు మండల టిడిపి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు.
కేక్ కట్ చేసి అభిమానులతో ఆనందం పంచుకున్న Dr. గొట్టిపాటి లక్ష్మీ
దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ Dr. గొట్టిపాటి లక్ష్మీ జన్మదిన వేడుకలను కురిచేడు మండలంలోని పడమటి వీరయపాలెం, వెంగాయపాలెం గ్రామాలలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో Dr. గొట్టిపాటి లక్ష్మీ Dr. కడియాల లలిత్ సాగర్ తో కలిసి కేక్ కట్ చేసి అభిమానుల అభినందనలు స్వీకరించారు.
కార్యక్రమంలో కురిచేడు మండల టిడిపి నాయకులు, మహిళలు, యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజల మధ్యే ఉంటూ సేవలందిస్తున్న నాయకురాలు Dr. గొట్టిపాటి లక్ష్మీ ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని కార్యకర్తలు ఆకాంక్షించారు.
పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు.
పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు. గత ఏడాది 81.1 శాతంగా ఉన్న ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది 85.25 శాతానికి పెరిగింది. బాలుర కంటే బాలికల ఉత్తీర్ణతా శాతం 5.22 శాతం ఎక్కువగా ఉండటం సంతోషకరం. ముఖ్యంగా ప్రభుత్వ బడులలో గత ఏడాది 72.8 శాతంగా ఉన్న ఉత్తీర్ణత ఈ సంవత్సరం 78.39 శాతానికి పెరగడం స్ఫూర్తిదాయకం. విద్యాశాఖ రూపొందించిన 100 రోజుల ప్రణాళికతో ఉత్తమ ఫలితాలను సాధించడం ప్రశంసనీయం. ఇందుకు ఐటి, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ తో సహా ఆ శాఖ అధికారులను, టీచర్లను, సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాను. పిల్లల్లో నైతిక విలువల పెంపుతో పాటు సమగ్ర విద్యా వికాసానికి విద్యా శాఖ చేస్తున్న కృషిని మరింత ముందుకు తీసుకువెళ్లాలని కోరుతున్నాను.
డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ,
టిడిపి ఇంచార్జ్,
దర్శి నియోజకవర్గం.
తాళ్లూరు మండలం తూర్పు గంగవరం పీహెచ్సీలో వడదెబ్బపై అవగాహన కార్యక్రమం
తాళ్లూరు మండలం తూర్పు గంగవరం PHCలో డాక్టర్ మౌనిక ఆధ్వర్యంలో వడదెబ్బపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
వేసవిలో ఎక్కువగా నీరు, పండ్ల రసాలు, కొబ్బరి నీరు, మజ్జిగ తీసుకోవాలని, కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. రోడ్లపై అమ్మే రంగు పానీయాలు తాగరాదని తెలిపారు.
వడదెబ్బ తగిలినవారిని వెంటనే నీడలోకి తీసుకెళ్లి చల్లగా ఉంచాలని, అపస్మారక స్థితిలో ఉంటే నీరు ఇవ్వకుండా వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దర్శి పట్టణంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న వదంతులపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ వై. రామారావు స్వయంగా పలు పెట్రోల్ బంకులను తనిఖీ చేసి స్టాక్ పరిస్థితిని పరిశీలించారు.
బంక్ యజమానుల ప్రకారం దర్శిలో ఎటువంటి కొరత లేదని, వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ప్రజలు వదంతులను నమ్మవద్దని, అవసరానికి మించి నిల్వ చేసుకోవద్దని పోలీసులు సూచించారు.
అదేవిధంగా ఎవరైనా కృత్రిమంగా కొరత సృష్టిస్తే Essential Commodities Act ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
సోమవరప్పపాడులో సందడి.. చంద్రబాబు బర్త్డేకు యువత ప్రత్యేక వేడుకలు!
తాళ్లూరు మండలం సోమవరప్పపాడు గ్రామంలో N. Chandrababu Naidu పుట్టినరోజు సందర్భంగా టిడిపి యువ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో SK. సైదా, సురేష్, వెంకటరావు, సాయి, డానీ తదితరులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు.
గ్రామంలో ఉత్సాహభరితంగా జరిగిన ఈ వేడుకలు స్థానికంగా ఆకర్షణీయంగా నిలిచాయి
ఏపీలో ఇంటింటి గణన ప్రారంభం... స్వయంగా తన వివరాలు నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి గణన, గృహాల జాబితా సేకరణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా చేపట్టిన స్వీయ నమోదు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తన వివరాలను నమోదు చేసి ఆరంభించారు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఆయన ఈ ప్రక్రియను పూర్తి చేశారు.
రాష్ట్ర జనాభా గణన సంచాలకులు జె. నివాస్ ఈ కార్యక్రమం గురించి ముఖ్యమంత్రికి వివరించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు se.census.gov.in వెబ్సైట్లోకి వెళ్లి తన వివరాలను నమోదు చేశారు.
ఈ స్వీయ నమోదు ప్రక్రియలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని అధికారులు కోరారు.
ప్రజలు తమ ఇళ్లకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో స్వయంగా నమోదు చేసుకునేందుకు ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం కల్పించారు. దీనివల్ల జనగణన ప్రక్రియ మరింత సులభతరం, వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఒంగోలు: సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) ఒంగోలు నియోజకవర్గం ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసాన్ని స్వాగతిస్తూ బ్యానర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ… రంజాన్ మాసం ముస్లింలకు ఆత్మశుద్ధి, నియమ నిష్ఠకు ప్రతీక అని పేర్కొన్నారు. ఉపవాసంతో పాటు ఇఫ్తార్ సమయంలో దేశ అభివృద్ధి, సమాజ ఐక్యత, శాంతి కోసం ప్రార్థనలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
దర్శిలో రథం లాగిన గొట్టిపాటి దంపతులు, శివ నామస్మరణతో మార్మోగిన పట్టణం
మహాశివరాత్రి సందర్భంగా దర్శి పట్టణంలో శివపార్వతుల రథ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమానికి దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అలంకరించబడిన రథాన్ని భక్తులతో కలిసి లాగుతూ శివభక్తిని చాటారు.
డా. గొట్టిపాటి లక్ష్మి దంపతుల పాల్గొనడంతో రథోత్సవానికి ప్రత్యేక శోభ చేకూరింది. శివనామ స్మరణతో దర్శి పట్టణ పురవీధులు మార్మోగగా, వేలాది మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
విజయవాడ:
తెలుగు రాష్ట్రాల్లో మత విద్వేషాలకు చోటు లేదని ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షుబ్లి అన్నారు. మేడారం జాతర సందర్భంగా వేధింపులకు గురైన కోవా బన్ విక్రేత వలీకి యావత్ హిందూ సమాజం అండగా నిలవడం మత సామరస్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వంలో మత సామరస్య వాతావరణం కొనసాగుతోందని, కోవా బన్ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వలీ & అతని మిత్ర బృందానికి రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు.
మేడారం కోవా బన్ వివాదం: పేద వ్యాపారి వలీకి అండగా మంత్రి నారా లోకేష్
మేడారం జాతరలో చోటుచేసుకున్న కోవా బన్ వివాదంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు.
ఈ ఘటనలో విమర్శలు ఎదుర్కొన్న పేద వ్యాపారి వలీకి అండగా నిలుస్తూ, ఆయనకు ధైర్యం చెప్పారు.
సోషల్ మీడియాలో స్పందించిన నారా లోకేష్ –
డియర్ బ్రదర్ వలీ, నీవు ఎదుర్కొన్న పరిస్థితికి నేను చాలా బాధపడ్డాను.
ఇలాంటి విభజన రాజకీయాలకు, మతపరమైన వేధింపులకు మన తెలుగు సమాజంలో చోటు లేదు.
త్వరలోనే నేను నిన్ను కలుస్తాను. నీ ఫేమస్ కోవా బన్ రుచి చూడాలని ఎదురుచూస్తున్నాను.
మనమందరం కలిసి నిలబడదాం అని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలతో వలీకి మద్దతుగా పలువురు సోషల్ మీడియాలో ముందుకు వస్తున్నారు.
సాధారణ జీవనం సాగించే చిన్న వ్యాపారులను టార్గెట్ చేసి అవమానించే ప్రయత్నాలు సమాజంలో ప్రమాదకర సంకేతాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మీడియా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చర్చ మొదలైంది.
ఉల్లగల్లు టీడీపీ కార్యకర్త షేక్ బాజీ మృతి పట్ల నారాపుశెట్టి పాపారావు సంతాపం
దర్శి / ఉల్లగల్లు:
దర్శి నియోజకవర్గంలోని ఉల్లగల్లు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముస్లిం యువ కార్యకర్త షేక్ బాజీ (యువ కిరణం) అకాల మరణం పట్ల దర్శి మాజీ ఎమ్మెల్యే నారాపుశెట్టి పాపారావు తీవ్ర సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
షేక్ బాజీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ, పార్టీ కార్యక్రమాల్లో ముందుండే వ్యక్తిగా గుర్తింపు పొందారని పాపారావు పేర్కొన్నారు. ముఖ్యంగా ముస్లిం యువతను తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తను కోల్పోవడం పార్టీకి తీరని లోటు అని అన్నారు.
ఈ సందర్భంగా నారాపుశెట్టి పాపారావు మాట్లాడుతూ,
“షేక్ బాజీ అకాల మరణం ఎంతో బాధాకరం. ఆయన పార్టీకి చేసిన సేవలు మరువలేనివి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు ఈ కష్టం నుంచి బయటపడేందుకు పార్టీ తరపున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మృతునికి నివాళులర్పించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రోడ్డుప్రమాదంలో గాయపడిన యువకుడికి మానవత సంస్థ ఆర్థిక సహాయం
దర్శి, ప్రకాశం జిల్లా:
ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తలకు, కాలికి శస్త్రచికిత్సలు చేయించుకుని ప్రస్తుతం మంచానికే పరిమితమై, గతంలో భార్యను కోల్పోయి ఇద్దరు చిన్న పిల్లలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో జీవిస్తున్న ముండ్లమూరు మండలం పులిపాడు సమీపంలోని బంగారమ్మగుట్ట గ్రామానికి చెందిన రాచగొర్ల రాజయ్య అనే యువకుని దీనస్థితి మానవత స్వచ్ఛంద సేవాసంస్థకు తెలియడంతో, సంస్థ సభ్యులు మానవతతో ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా ఈ రోజు దరశి మానవత స్వచ్ఛంద సేవాసంస్థ చైర్మన్ దేవతి వరప్రసాదు, ప్రకాశం జిల్లా మానవత సంస్థ ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాసరెడ్డి, అధ్యక్షులు చీదెళ్ళ బసవయ్య, అత్యవసర విభాగం డైరెక్టర్ రోశారావు, సభ్యులు నారాయణ తదితరులు బంగారమ్మగుట్ట గ్రామంలోని బాధితుని స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. బాధితుడికి మనోధైర్యం నింపుతూ సంస్థ తరఫున ₹5,000/- నగదును అందజేసి ఆత్మీయ సహకారం అందించారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మానవత సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాసరెడ్డి, మానవత స్వచ్ఛంద సేవాసంస్థ మహోన్నత ఆశయాలతో, విలువలతో పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 141 కేంద్రాల ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా నిస్వార్థంగా సేవలందిస్తున్న మానవతామూర్తులు ఈ సంస్థలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకొని, సంస్థ అభివృద్ధికి భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
తిరుమలలో దేవుని ముందు లక్కీ డ్రా రీల్స్.. యువకులు అరెస్ట్
తిరుమల ఆలయం ముందు “లక్కీ డ్రాలో బీఎండబ్ల్యూ కారు గెలుచుకోండి” అంటూ ఇద్దరు యువకులు రీల్ వీడియో చేశారు.
ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్ కావడంతో తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు.
గోలి 4 అనిల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, హైదరాబాద్కు చెందిన మరో యువకుడిని కారుతో సహా తిరుమలకు తీసుకొచ్చారు.
మరో వ్యక్తి నరేంద్ర ఇప్పటికే హైదరాబాద్ జైలులో ఉన్నాడు.
పవిత్ర స్థలాల్లో ఇలాంటి రీల్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు
దర్శి : భారత చైతన్య యువజన పార్టీ (బిసివై) ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గ యూత్ కన్వీనర్గా తెలుకుట్ల వెంకట యాదవ్ను నియమించారు.
క్షేత్రస్థాయిలో వెంకట యాదవ్కు ఉన్న పట్టు, యువతలో ఆయనకు ఉన్న ఆదరణను గుర్తించిన పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఈ బాధ్యతను అప్పగించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ నియామకంపై వెంకట యాదవ్ హర్షం వ్యక్తం చేస్తూ, నియోజకవర్గంలో యువతను చైతన్యవంతం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.
వైఎస్ జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టిడిపి నేత కడియాల వెంకటేశ్వరరావు
గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి కార్యకర్తను అరెస్టు చేయించిన ఘటనను గుర్తు చేసిన టిడిపి డాక్టర్స్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కడియాల వెంకటేశ్వరరావు,
నేడు అదే తరహా వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులపై జరిగితే, అంబటి రాంబాబును పరామర్శించడమే సరైనదా? అంటూ ప్రశ్నించారు.
ఈ విషయంలో ద్వంద్వ వైఖరి ఎందుకు పాటిస్తున్నారంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
ఇదేనా మీ రాజకీయ సంస్కారం? ఇదేనా మీ రాజకీయ విధానం? అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి కడియాల వెంకటేశ్వరరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తలసీమియా బాధితుల కోసం గుంటూరులో బృహత్ రక్తదాన శిబిరం పోస్టర్ ఆవిష్కరణ
పాత గుంటూరులో క్యాంపెయిన్షిప్ సంస్థ ఆధ్వర్యంలో తలసీమియా బాధితులకు సహాయంగా నిర్వహించనున్న రక్తదాన శిబిరం పోస్టర్ను సోమవారం ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి & తెనాలి–పత్తిపాడు నియోజకవర్గ పరిశీలకులు గులాం రసూల్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో క్యాంపెయిన్షిప్ సభ్యులు వసీం అలీ చౌదరి, మునీర్, ఖాజా, నజీముద్దీన్, జహీర్ పాల్గొన్నారు.
అలాగే వైసీపీ నాయకులు మున్వర్ హాజరై రాబోయే రక్తదాన శిబిరానికి తమ పూర్తి మద్దతు తెలిపారు.
రెడ్డి నగర్–బసాపురం రోడ్డుకు నిధులు: పవన్ కళ్యాణ్ వేగమే ప్రత్యేకం
రెడ్డి నగర్ నుంచి బసాపురం వరకు రోడ్డు నిర్మాణానికి రూ.1.90 కోట్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దర్శి ప్రజలకు సంక్రాంతి కానుక అందించారని దర్శి టిడిపి ఇంచార్జ్ Dr. గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. శుక్రవారం రోడ్డు పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.
కోరిన వెంటనే నిధులు మంజూరు చేసిన పవన్ కళ్యాణ్ ప్రజా నాయకుడని, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు–పవన్–లోకేష్ కలిసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని Dr. లక్ష్మీ అన్నారు. దర్శి నియోజకవర్గంలో 19 నెలల్లో దాదాపు రూ.200 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని వెల్లడించారు.
తరువాత లోకేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసిన Dr. లక్ష్మీ.
కార్యక్రమంలో టిడిపి–జనసేన–బిజెపి నాయకులు పాల్గొన్నారు.
గంటల్లోనే రోడ్డు నిర్మాణం—పవన్ కళ్యాణ్ కే సాధ్యం: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
ముండ్లమూరు మండలంలోని రెడ్డి నగర్ నుంచి బసాపురం వరకు రోడ్డు నిర్మాణానికి గౌరవ ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ రూ.1 కోటి 90 లక్షలు మంజూరు చేసి దర్శి ప్రజలకు సంక్రాంతి కానుక అందించారని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. శుక్రవారం ఆమె ఈ రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
మాట నిలబెట్టిన కూటమి – తూర్పు వీరాయపాలెంలో అభివృద్ధికి 3 కోట్లు!
దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి రూ. 3 కోట్లు వ్యయంతో టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ శంకుస్థాపన చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టిందని ఆమె పేర్కొన్నారు.
లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి, స్కూల్ పిల్లలకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఉల్లగల్లులో శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మొత్తం 274 డ్వాక్రా మహిళా సంఘాలకు ₹27 కోట్లు రుణాన్ని ప్రభుత్వం తరఫున అందజేశారు. ఈ కార్యక్రమంలో నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొని మహిళా శక్తికరణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
మహిళలు స్వయం సంస్కరణలో, చిన్న వ్యాపారాలు ప్రారంభించడంలో, కుటుంబ ఆర్థిక స్థితి బలోపేతం చేసుకోవడంలో ఈ రుణాలు కీలకంగా ఉపయోగపడతాయని కార్యక్రమంలో స్పష్టం చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై ధన్యవాదాలు తెలిపారు.
దర్శి, జనవరి 17: దర్శి నియోజకవర్గంలో రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు, ప్రజాప్రతినిధులు విచ్చేయనున్నారు. ఉదయం 10.30కి దర్శిలో రూ.4 కోట్లతో కొత్త విద్యుత్ డివిజనల్ కార్యాలయానికి భూమిపూజ, 11.15కి ఉల్లగల్లు లో రూ.3.90 కోట్లతో 33/11 కేవి సబ్స్టేషన్ శంఖుస్థాపన జరుగుతుంది. 11.45కి కీ.శే. నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ, 12 గంటలకు బహిరంగ సభ జరుగుతుంది. మధ్యాహ్నం 2గంటలకు పసుపుగళ్లలో బస్ షెల్టర్ను ప్రారంభిస్తారు.
ఈ కార్యక్రమాల్లో మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొననున్నారు. మీడియా సోదరులు కార్యక్రమాలను విస్తృతంగా కవర్ చేయాలని దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కోరారు.
ఉల్లగల్లో మహిళా శక్తికి కొత్త అధ్యాయం – జన్ శిక్షణ సేవా సంస్థాన్ టైలరింగ్ కోర్స్ ముగింపు
ఉల్లగల్లు, ప్రకాశం జిల్లా:
జన్ శిక్షణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో గత మూడు నెలలుగా నిర్వహించిన టైలరింగ్ కోర్సు ఈరోజుతో విజయవంతంగా పూర్తైంది. ఈ కోర్సులో పాల్గొన్న 20 మంది మహిళలు టైలరింగ్ నైపుణ్యాలను అభ్యసించి, స్వయం ఉపాధికి దారి తెరిచారు.
ట్రైనర్ ప్రసన్న మాట్లాడుతూ, “ఈ కోర్సు ద్వారా మహిళలు స్వంతంగా ఉపాధి పొందే సామర్థ్యం పెరిగింది. ఇంటి వద్దే టైలరింగ్ ప్రారంభించవచ్చు, చిన్న స్థాయిలో బొటిక్ లాంటి వ్యాపారాలు కూడా మొదలు పెట్టొచ్చు” అని తెలిపారు.
కార్యక్రమ ముగింపు సందర్భంగా ట్రైనర్ ప్రసన్నకు ఘన సన్మానం నిర్వహించారు. స్థానిక మహిళలు, సంస్థ ప్రతినిధులు సునీల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉల్లగల్లు కు తీసుకువచ్చేందుకు కృషి చేసిన భూలక్ష్మిని కూడా మహిళలు ప్రశంసిస్తూ సన్మానించారు.
ప్రకాశం జిల్లా – దర్శిలో కార్డన్ & సెర్చ్, 67 బైక్లు స్వాధీనం
ప్రకాశం జిల్లా దర్శి పట్టణ శివారులోని శివరాజ్ నగర్ ప్రాంతంలో శాంతి భద్రతలు, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల నిరోధం కోసం పోలీసులు అకస్మికంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించారు.
మార్కాపురం జిల్లా ఇంచార్జి ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ ఆదేశాల మేరకు, దర్శి డిఎస్పి బి. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. సీఐలు, ఎస్సైలు సహా 50 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
తనిఖీల్లో సరైన పత్రాలు లేని 67 మోటార్సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, మత్తు పదార్థాలపై ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు.
తరువాత “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో ర్యాలీ నిర్వహించి, యువత, ప్రజలకు మత్తుపదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. గంజాయి–డ్రగ్స్ విక్రయం లేదా వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామంలోని 200 ఏళ్ల చరిత్ర గల నాగూర్ మీరావలి దర్గా వద్ద గంధ మహోత్సవం రేపు భక్తి పూర్వకంగా జరగనుంది. గత సంవత్సరం పునఃప్రారంభించిన ఈ వేడుక ఈ ఏడాది రెండవ గంధ మహోత్సవంగా జరుగుతోంది.
పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు, ప్రముఖులు హాజరుకానున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
రేపు ఉదయం 10 గంటలకు 10,000 మందికి అన్నదానం కూడా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
శ్రీ రామా యోగి స్వామీ తిరుణాళలో పాల్గొన్న టిడిపి యువ నాయకులు డా. కడియాల లలిత్ సాగర్
కురిచేడు మండలం పొట్లపాడు గ్రామంలో శ్రీ రామా యోగి స్వామీ తిరుణాళ సందర్భంగా సోమవారం సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో టిడిపి యువ నాయకులు డా. కడియాల లలిత్ సాగర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం టిడిపి నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై ప్రసంగించి, స్వామి కృపతో ప్రజలందరికీ శాంతి, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు, ఒంగోలు పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు కాట్రాజు నాగరాజు, జనసేన నాయకులు వరికూటి నాగరాజు, దర్శి టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్నా, పొట్లపాడు గ్రామ టిడిపి నాయకులు, టిడిపి–జనసేన–బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఒంగోలు ప్రకాశం భవనంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నూతన లిఫ్ట్ ప్రారంభం
ఒంగోలు నగరంలోని ప్రకాశం భవనంలో ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ను జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి
ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజ బాబు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దర్శి టీడీపీ ఇంచార్జ్ శ్రీమతి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ముఖ్యంగా హాజరయ్యారు.
అలాగే ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్, గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే శ్రీ విజయ్ కుమార్, టూరిజం చైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ, ఎమ్మెల్సీ శ్రీ కంచర్ల శ్రీకాంత్, యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్సన్ బాబు తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు, ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు మరియు మహిళలకు సౌకర్యంగా ఉండేలా ఈ లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఇది ఒక కీలక ముందడుగు అని నాయకులు పేర్కొన్నారు.
ఐటీ పార్క్ పేరుతో వక్ఫ్ భూములు ప్రైవేటుకు అప్పగిస్తే సహించం
అంజుమన్–ఏ–ఇస్లామియా సంస్థకు చెందిన వక్ఫ్ భూములను ఐటీ పార్క్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త నూరిఫాతిమా, తెనాలి–పత్తిపాడు నియోజకవర్గ పరిశీలకులు గులాం రసూల్ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
1915 సంవత్సరంలో చిన్న కాకాని గ్రామంలో సర్వే నంబర్లు 187/1, 201/A,B, 201/2B, 202/B, 203/A,B, 204/A,C&D, 222/2A & 2Bలలో ఉన్న మొత్తం 81.23 ఎకరాల భూమిని ముస్లిం సమాజ అభ్యున్నతి కోసం దాతలు అంజుమన్–ఏ–ఇస్లామియా సంస్థకు అందజేశారని వారు గుర్తు చేశారు.
ఈ భూమిని కేవలం
ముస్లింల స్కిల్ డెవలప్మెంట్,
లైబ్రరీ,
ముస్లిం పిల్లలకు స్కాలర్షిప్లు,
విద్యాసంస్థల ఏర్పాటు
కోసమే వినియోగించాలని దాతలు స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు.
అయితే వక్ఫ్బోర్డు ద్వారా ఈ భూమిలోని 71.57 ఎకరాలను ఐటీ పార్క్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని విమర్శించారు. వక్ఫ్బోర్డు కమిటీకి కేవలం మూడు సంవత్సరాల పాటు మాత్రమే లీజుకు ఇచ్చే అధికారం ఉండగా, 30–40 సంవత్సరాల లీజుల ప్రతిపాదనలు ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు.
జిల్లా కలెక్టర్ స్వయంగా టెండర్ల ప్రకటనలు చేయడం కూడా చట్టవిరుద్ధమని, ఇది ముస్లిం సమాజాన్ని మరింత వెనుకబాటుకు నెట్టే చర్యగా అభివర్ణించారు.
వక్ఫ్ భూముల విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరించిన వక్ఫ్బోర్డు సీఈఓపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వక్ఫ్బోర్డు ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్పై చర్యలు తీసుకుని వక్ఫ్ ఆస్తులను కాపాడాలని కోరారు.
చిన్న కాకాని అంజుమన్–ఏ–ఇస్లామియా సంస్థకు చెందిన 81.23 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే యోచనను విరమించుకోని పక్షంలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి, ముస్లిం సంఘాలతో కలిసి రాష్ట్ర వక్ఫ్బోర్డు కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెనుకాడబోమని వారు హెచ్చరించారు.
అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయిస్తే పోలియోను పూర్తిగా నిర్మూలించవచ్చని ఐఆర్సీయస్ ఎగ్జిక్యూటివ్ మెంబరు కపురం శ్రీనివాసరెడ్డి అన్నారు. దరిశి గడియార స్తంభం సెంటర్లో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో 11 నెలల చిన్నారికి పోలియో చుక్కలు వేసి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆయన అభినందించారు.
ఒంగోలులో గంజాయి కట్టడి: రైలులో 7 కిలోల గంజాయి స్వాధీనం
ఒంగోలు: గంజాయి మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ఒంగోలు రైల్వే స్టేషన్తో పాటు పలు ఎక్స్ప్రెస్ రైళ్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., పర్యవేక్షణలో జరిగిన తనిఖీల్లో అలప్పుజా ఎక్స్ప్రెస్లో సుమారు 7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి సేవించినా, విక్రయించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షూబ్లిని సత్కరించిన సయ్యద్ మెహతాజ్ బేగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్గా నియమితులైన జనాబ్ ఫారూక్ షూబ్లి గారిని టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సయ్యద్ మెహతాజ్ బేగం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఉర్దూ భాషాభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. ఉర్దూ భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణలో ఆయన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో ఉర్దూ భాషకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దర్శిలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ – డా. గొట్టిపాటి లక్ష్మీ
దర్శి నియోజకవర్గంలో 135 మంది లబ్ధిదారులకు రూ.82,36,297 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ శనివారం తన నివాసం వద్ద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్యతో పాటు పార్టీ నేతలు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
అంగన్వాడీలకు 5G ఫోన్లు – మహిళల ఆరోగ్యం, శిశు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: డా. గొట్టిపాటి లక్ష్మీ
దర్శి పట్టణంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అంగన్వాడీ సేవలను మరింత బలోపేతం చేస్తూ కీలక అడుగు వేసింది. దర్శి నియోజకవర్గంలోని 334 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 15 మంది సూపర్వైజర్లకు కలిపి మొత్తం 344 మందికి 5G ఫోన్లను దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ శనివారం అందజేశారు.
ఈ సందర్భంగా డా. లక్ష్మీ మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం, శిశు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ద్వేయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో సాంకేతికతను వినియోగిస్తూ అంగన్వాడీలను బలోపేతం చేస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం అందించే పోషకాహారం ప్రతి శిశువుకు చేరేలా అంగన్వాడీ కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలని, గర్భిణీ స్త్రీలు, మహిళల ఆరోగ్య పరిరక్షణలో ముందుండాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళలు తమ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని, ఒక డాక్టర్గా సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు.
అంగన్వాడీలకు 5G ఫోన్లు – మహిళల ఆరోగ్యం, శిశు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: డా. గొట్టిపాటి లక్ష్మీ
దర్శి పట్టణంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అంగన్వాడీ సేవలను మరింత బలోపేతం చేస్తూ కీలక అడుగు వేసింది. దర్శి నియోజకవర్గంలోని 334 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 15 మంది సూపర్వైజర్లకు కలిపి మొత్తం 344 మందికి 5G ఫోన్లను దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ శనివారం అందజేశారు.
ఈ సందర్భంగా డా. లక్ష్మీ మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం, శిశు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ద్వేయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో సాంకేతికతను వినియోగిస్తూ అంగన్వాడీలను బలోపేతం చేస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం అందించే పోషకాహారం ప్రతి శిశువుకు చేరేలా అంగన్వాడీ కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలని, గర్భిణీ స్త్రీలు, మహిళల ఆరోగ్య పరిరక్షణలో ముందుండాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళలు తమ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని, ఒక డాక్టర్గా సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు.
పోలియో రహిత భవిష్యత్తే లక్ష్యం – జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు
ఈ రోజు ఉదయం పొన్నలూరు మండలం, పొన్నలూరు గ్రామంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజా బాబు పోలియో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతిసారి రెండు చుక్కలు వేయడం ద్వారా పిల్లల ఆరోగ్యానికి సంపూర్ణ రక్షణ లభిస్తుందన్నారు. డిసెంబర్ 21, 2025 నుంచి పోలియో కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. 0–5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
స్వచ్ఛతతోనే స్వర్ణాంధ్ర సాధ్యం – మంత్రి డోలా పిలుపు
కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండల కేంద్రంలో నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి , జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని వారు పేర్కొంటూ ప్రజలు స్వచ్ఛత పాటించాలని పిలుపునిచ్చారు.
ప్రాణాలే ప్రథమ లక్ష్యం: నిద్ర మత్తుపై ప్రకాశం పోలీసుల ప్రత్యేక కార్యక్రమం
రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు అర్థరాత్రి వేళ ప్రత్యేక ‘Face Wash & Go’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై రాత్రి 1 గంట నుంచి ఉదయం 4:30 గంటల వరకు ఈ కార్యక్రమం చేపట్టారు.
హైవేలపై ప్రయాణిస్తున్న వాహనాలను నిలిపివేసి, డ్రైవర్లు నిద్ర మత్తు దూరం చేసుకోవడానికి ముఖం కడుక్కోవడం, టీ తాగడం ద్వారా అప్రమత్తంగా ప్రయాణం కొనసాగించాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో కుటుంబ భద్రతను గుర్తుంచుకుని జాగ్రత్తగా వాహనం నడపాలని అవగాహన కల్పించారు.
రోడ్డు భద్రత కోసం ఇలాంటి ప్రజా భద్రతా కార్యక్రమాలు కొనసాగిస్తామని ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు.
దర్శి ఆర్టీసీ డిపో స్థల కేటాయింపుపై కలెక్టర్తో చర్చించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
ఒంగోలులోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ జిల్లా కలెక్టర్ పి. రాజబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దర్శిలో ఆర్టీసీ డిపో అవసరం ఉందని వివరించి, డిపో నిర్మాణానికి అనువైన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్ను కోరారు.
దీనిపై కలెక్టర్ రాజబాబు గారు సానుకూలంగా స్పందించి, స్థానిక రెవెన్యూ సిబ్బందితో కలిసి డిపోకు అనువైన ప్రభుత్వ స్థలాన్ని గుర్తిస్తామని హామీ ఇచ్చినట్లు డాక్టర్ లక్ష్మీ తెలిపారు.
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు దర్శి సర్కిల్ పరిధిలోని దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు పోలీస్ స్టేషన్లకు చెందిన రౌడీషీటర్లు మరియు సస్పెక్ట్ షీటర్లకు దర్శి సర్కిల్ ఆఫీస్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దర్శి సిఐ వై. రామారావు ఆధ్వర్యంలో ముండ్లమూరు ఎస్సై కె. కమలాకర్, తాళ్లూరు ఎస్ఐ మల్లికార్జున్ కలిసి నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ రామారావు మాట్లాడుతూ, అందరూ సత్ప్రవర్తనతో ఉండాలని, నేరాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు నెలల బైండోవర్లో ఉన్నప్పటికీ ఎవరైనా నేరాల్లో పాల్గొంటే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
చాకచక్యంగా దొంగతనం కేసు ఛేదన – నిందితుల అరెస్ట్, భారీ రికవరీ
ఒంగోలు పట్టణంలోని బృందావనం కళ్యాణ మండపంలో జరిగిన దొంగతనం కేసును ప్రకాశం జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా స్వల్ప వ్యవధిలో ఛేదించారు. ఈ కేసులో సుమారు రూ.20.20 లక్షల విలువైన బంగారు నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు.
2025 నవంబర్ 27న పెళ్లి వేడుకల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు 158 గ్రాముల బంగారు నగలు, నగదుతో ఉన్న బ్యాగ్ను దొంగిలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది.
ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, తాలూకా సీఐ టి. విజయ కృష్ణ నేతృత్వంలో పోలీసులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్ఘర్ జిల్లా సాన్సి నివాసి గ్రామానికి వెళ్లి ఇద్దరు నిందితులు మరియు ఇద్దరు బాల నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బంగారు నగలు, రూ.1.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు.
సీనియర్ టీడీపీ నాయకుడు బోడపాటి చంద్రమౌళి పరామర్శించిన డా. గొట్టిపాటి లక్ష్మీ
మండల కేంద్రమైన ముండ్లమూరు కు చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ కో-ఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ బోడపాటి చంద్రమౌళిని దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్,
ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో ఆపరేషన్ చేయించుకుని కోలుకుంటున్న చంద్రమౌళి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు.